
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తాడిచెట్టు పై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్సవాడలో గురువారం జరిగింది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. సిర్సవాడకి చెందిన చింతకింది మల్లేశ్ గౌడ్ (44) గీత కార్మికుడిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
రోజు మాదిరిగానే గురువారం ఉదయాన్నే తాటి చెట్టు ఎక్కడానికి వెళ్లాడు. చెట్టు పైకి ఎక్కాక మోపు ఊడిపోవడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, 9వ తరగతి చదివే కూతురు, మూడేళ్ల కొడుకు ఉన్నారు. ప్రభుత్వం మల్లేశ్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.